కర్నూలు: మైనింగ్ క్వారీలోకి దూసుకెల్లిన కారు

ABN , First Publish Date - 2020-12-03T15:25:32+05:30 IST

కొత్తపల్లి సమీపంలో మైనింగ్ క్వారీలోకి కారు అదుపుతప్పి దూసుకెల్లింది.

కర్నూలు: మైనింగ్ క్వారీలోకి దూసుకెల్లిన కారు

కర్నూలు జిల్లా: బేతంచెర్ల మండలం, కొత్తపల్లి సమీపంలో మైనింగ్ క్వారీలోకి కారు అదుపుతప్పి దూసుకెల్లింది. క్వారీ గుంతలోని నీళ్లలో కారు మునిగింది. ఈ ఘటనలో ఇద్దరు సురక్షితంగా బయటకురాగా.. కారున్య అనే తొమ్మిదేళ్ల బాలిక కారులోనే చిక్కుకుపోయింది. గుత్తి నుంచి బేతంచెర్ల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని జేసీబీ ద్వారా కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2020-12-03T15:25:32+05:30 IST