వాకింగ్‌ చేస్తున్న యువకుడిపైకి కారు

ABN , First Publish Date - 2022-07-06T06:41:12+05:30 IST

జాతీయ రహదారిపై ప్రత్తిపాడు హైవే నిర్వహణ యార్డు సమీపంలో మంగళవారం ఇన్నోవా కారు ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు.

వాకింగ్‌ చేస్తున్న యువకుడిపైకి కారు

అక్కడికక్కడే మృతి

ప్రత్తిపాడు, జూలై 5: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు హైవే నిర్వహణ యార్డు సమీపంలో మంగళవారం ఇన్నోవా కారు ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్‌ఐ సీహెచ్‌ సుధాకర్‌ అందించిన వివరాలు ప్రకారం.. ప్రత్తిపాడు సాయినగర్‌కు చెందిన పతి భువనచంద్ర (26) వాకింగ్‌ కోసం మంగళవారం జాతీయ రహదారిపై వెళ్తుండగా విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో భువనచంద్ర తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యావంతుడైన భువన చంద్ర వాకింగ్‌ కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో సాయినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి పతి శ్రీనివాస్‌, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2022-07-06T06:41:12+05:30 IST