పెళ్లి బట్టల కోసం వెళ్తుండగా చెట్టును ఢీకొట్టిన కారు.. జరిగిన ఘోరమిదీ..!
ABN , First Publish Date - 2020-08-03T20:12:32+05:30 IST
వారంతా ప్రాణమిత్రులు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వారిలో ఒకరి పెళ్లి ఈనెల 13న ఉంది. పెళ్లిబట్టలు కొనుగోలు చేయడానికి కారులో కరీంనగర్ వెళుతుండగా
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
స్నేహితుల దినోత్సవం రోజున విషాదం
సుల్తానాబాద్(పెద్దపల్లి): వారంతా ప్రాణమిత్రులు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వారిలో ఒకరి పెళ్లి ఈనెల 13న ఉంది. పెళ్లిబట్టలు కొనుగోలు చేయడానికి కారులో కరీంనగర్ వెళుతుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఒకరు మృతిచెందగా, పెళ్లి కొడుకుతో సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సుల్తానాబాద్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... గోదావరిఖని అంబేద్కర్నగర్కు చెందిన కొలి పాక శివశంకర్, వినయ్, రోహిత్, ఇప్పు సాత్విక్ ఏపీ 28 డీహెచ్ 4113 నంబ రుగల కారులో కరీంనగర్ వెళుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం సుల్తానాబా ద్ మండలం నర్సయ్యపల్లిలోని నర్సరీ సమీపంలో రాజీవ్ రహదారిపై అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకుపోయి చెట్టును ఢీకొంది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఇప్పు సాత్విక్(27)తో పాటు శివశంకర్, వినయ్, రోహిత్ తీవ్రం గా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చెరుకున్న సీఐ, ఎస్ఐ మహేం దర్రెడ్డి, ఉపేందర్రావు వీరందరిని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఒక ప్రైవే ట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సాత్విక్ మృతిచెందగా, శివశం కర్ తదితరుల పరిస్థితి విషమంగా ఉంది. కాగా వీరిలో కొలిపాక శివశంకర్ వివాహం ఈనెల 13న ఉంది. శుభకార్యం కోసం బట్టలకు వెళ్లిన వీరు ప్రమా దానికి గురికావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సీఐ, ఎస్ కరీంనగర్లోనే పోస్టుమార్టం ఏర్పాట్లు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.