చెట్టును ఢీకొన్న కారు : ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-04-18T05:36:13+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి కి తీవ్ర గాయాలయ్యాయి.

చెట్టును ఢీకొన్న కారు : ఒకరి మృతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 17: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి శివారులో శనివారం ఉదయం చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం ముదక్‌ప ల్లికి చెందిన క్రిష్ణాగౌడ్‌, హరిష్‌గౌడ్‌, సాగర్‌గౌడ్‌ శుక్రవారం సిద్దిపేట జిల్లా చేర్యా ల మండలం కొమ్మురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లి దర్శించుకుని శనివారం ఉదయం స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. కామారెడ్డి సమీపంలోని ఉగ్రవాయి సమీపంలో చెట్టుకు ఢీకొన్నారు. కారులో ప్రయాణి స్తున్న క్రిష్ణగౌడ్‌ (30) అక్క డిక్కడే మృతిచెందగా.. కారును డ్రైవింగ్‌ చేస్తున్న హరిష్‌గౌడ్‌, సాగర్‌గౌడ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తర లించారు. కృష్ణగౌడ్‌కు భార్య ఉంది. మృతుడి అన్న దత్తగౌడ్‌ ఫిర్యాదు మేరకు కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బాన్సువాడలో..

బాన్సువాడ: మండలంలోని బోర్లం క్యాంపు గ్రామ సమీపంలో శనివారం ఉద యం కారు బోల్తా పడగా, ఒకరికి గాయాలైయ్యాయి. మద్నూర్‌ ఆర్టీవో గోపినాథ్‌ కారులో ప్రయాణిస్తున్నాడు. అదుపుతప్పి బోల్తా పడడంతో స్వల్ప గాయాల య్యాయి. ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

Updated Date - 2021-04-18T05:36:13+05:30 IST