అదుపుతప్పి కారు బోల్తా: ఒకరి మృతి
ABN , First Publish Date - 2021-10-17T04:53:28+05:30 IST
మండల పరిధిలో ని గోకారం గేటు సమీపంలోని కల్వకుర్తి-దేవర కొండ జాతీయ రాహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయలైన సంఘటన శుక్రవారం చో టు చేసుకొంది.
చారకొండ, అక్టోబరు 16: మండల పరిధిలో ని గోకారం గేటు సమీపంలోని కల్వకుర్తి-దేవర కొండ జాతీయ రాహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడి ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయలైన సంఘటన శుక్రవారం చో టు చేసుకొంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వి వరాల ప్రకారం.. మండల పరిధిలోని జూపల్లి గ్రామానికి చెందిన కొండ్రెడి రమేష్, అక్కి వం శి గౌడ్, గూడురు మహేష్, శివగణేష్ శుక్రవారం చారకొండకు మహేంద్ర జైలో వా హనంలో వచ్చి తిరుగు ప్రయాణంలో జూపల్లి గ్రామానికి వెళ్తుండగా గోకా రం గేటు సమీపంలో రాహదారిపై వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. కారు లో ప్రయాణిస్తున్న డ్రైవర్ కొండ్రెడి రమేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగ తా ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో అంబులైన్స్లో కల్వకుర్తి ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ కొండ్రెడి రమేష్ (26) మృతి చెందాడు. మిగతా ముగ్గురు స్వల్వ గాయాలతో బయట పడ్డారు. మృతునికి భార్య శ్రీలక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.