కారులో తరలిస్తున్న విగ్రహాల స్వాధీనం
ABN , First Publish Date - 2021-11-19T14:51:26+05:30 IST
విల్లుపురం సమీపంలో కారులో తరలిస్తున్న విగ్రహా లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విల్లుపురం సమీపం కిలియనూర్ చెక్ పోస్ట్ పరిధిలో పుదువై- దిండి వనం జాతీయ రహదారిపై ప్రత్యేక ఎస్ఐ శ్రీపతి
పెరంబూర్(చెన్నై): విల్లుపురం సమీపంలో కారులో తరలిస్తున్న విగ్రహా లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విల్లుపురం సమీపం కిలియనూర్ చెక్ పోస్ట్ పరిధిలో పుదువై- దిండి వనం జాతీయ రహదారిపై ప్రత్యేక ఎస్ఐ శ్రీపతి నేతృ త్వంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆ మార్గంలో అతివేగంగా వచ్చిన కారును పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను చూసిన డ్రైవర్ కారు ఆపి పారిపోయేందుకు యత్నించడంతో పోలీసులు అతనిని వెంటాడి పట్టుకున్నారు. కారును తనిఖీ చేసిన పోలీసులు రాముడు, ఆంజనేయుడు, పెరుమాళ్ విగ్రహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కారు డ్రైవర్ మనోహరన్ను విచారించగా, తంజావూరు జిల్లా పుంపుహార్ నుంచి ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్కు ఇత్తడితో తయారుచేసిన విగ్రహాలను తరలిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.