విధ్వంస పాలనకు కేరాఫ్‌ ఆంధ్రప్రదేశ్‌

ABN , First Publish Date - 2022-06-26T05:34:57+05:30 IST

విధ్వంస పాలనకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదే శ్‌ను వైసీపీ పాలకులు మార్చారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు.

విధ్వంస పాలనకు కేరాఫ్‌ ఆంధ్రప్రదేశ్‌

 ప్రజా వేదిక, అన్నా క్యాంటీన్‌లను కూల్చిన ఘనత వైసీపీ పాలకులదే

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజం

అద్దంకి, జూన్‌ 25: విధ్వంస పాలనకు  కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదే శ్‌ను వైసీపీ పాలకులు  మార్చారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు. ఈమేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో విధ్వంసం తప్పా అభివృద్ధి లేదన్నారు. వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి  ఇప్పుడు ఏ కంగా రాష్ట్రంలోని సంపద కొల్లగొట్టే వరకు వచ్చిందన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తే జగన్మోహనరెడ్డి పాలనలో తిరోగమనంలో పయనిస్తుందన్నారు. చాలా మంది సీఎంలు రా ష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచిస్తే జగన్మోహనరెడ్డి మా త్రం ఎలా విధ్వంసం చేయాలో అనే పనిలో నిమగ్నమయ్యారని రవికుమార్‌ పేర్కొన్నారు. పేద వాడి కి అన్నం పెట్టే  అన్నా క్యాం టీన్‌లను సైతం కూల్చిన  సీఎంకు పాలన సాగించే అర్హత లేద న్నారు. చంద్రబాబు పాలనలో ఎన్నో పరిశ్రమలు వస్తే ఇప్పుడు ఇతర రాష్ర్టాలకు తరలిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలలో నివసిస్తేనే అర్హులు అంటూ కొత్త మెలిక పెట్టి  దళి తులకు ఉచిత విద్యుత్‌కు మంగళం పాడిందన్నారు. పక్క రాష్ర్టాలలో రైతుల కోసం వ్యవసాయానికి మోటార్లు బిగించేది లేదని  తేల్చి చెబితే, మన రాష్ట్రంలో మాత్రం  వ్యక్తిగత అవసరాల కోసం రైతుల జీవితాల ను పణంగా పెడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వాన్ని త్వరగా సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే రవికుమార్‌ పేర్కొన్నారు.


Updated Date - 2022-06-26T05:34:57+05:30 IST