పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-04-23T05:24:40+05:30 IST
మండలంలోని దొర్నిపాడు గ్రామానికి చెందిన ఐదుగురు పేకాట ఆడుతుండగా దాడి చేసి వారి వద్ద నుంచి రూ.3,680 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కీర్తి తెలిపారు.
దొర్నిపాడు, ఏప్రిల్ 22: మండలంలోని దొర్నిపాడు గ్రామానికి చెందిన ఐదుగురు పేకాట ఆడుతుండగా దాడి చేసి వారి వద్ద నుంచి రూ.3,680 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కీర్తి తెలిపారు. వీరు దొర్నిపాడు నుంచి ఉయ్యాలవాడకు రహదారిలో పేకాట ఆడుతున్న సమాచారం మేరకు దాడి చేశామని ఎస్ఐ తెలిపారు. ఈదాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని కూలూరు రహదారిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.16,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మారుతి తెలిపారు. కూలూరు రహదారిలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు.