మొక్కల సంరక్షణలో జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2021-07-27T05:49:57+05:30 IST

మొక్కల సంర క్షణలో జాగ్రత్తలు పాటిం చాలని డీఆర్‌డీఏ ఏపీడీ పెంటయ్య అన్నారు. పాలకవీడు మండల కేంద్రంలో 7వ విడత హరితహారంలో రహదారులపై బహుళ వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

మొక్కల సంరక్షణలో జాగ్రత్తలు పాటించాలి
పాలకవీడులో మొక్కల నాటుతుండగా పరిశీలిస్తున్న ఏపీడీ పెంటయ్య

పాలకవీడు / మునగాల జూలై 26 : మొక్కల సంర క్షణలో జాగ్రత్తలు పాటిం చాలని డీఆర్‌డీఏ ఏపీడీ పెంటయ్య అన్నారు. పాలకవీడు మండల కేంద్రంలో 7వ విడత హరితహారంలో రహదారులపై బహుళ వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మండలంలోని గుడుగుంట్ల పాలెం నుంచి జాన్‌పహాడ్‌ వదరకు గుర్తించిన రహదారిలో బహుళ వరుసలో మొక్కలు నాటుతు న్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జానయ్య, సర్పంచ్‌ బైరెడ్డి నాగలక్ష్మి జితేందర్‌రెడ్డి, ఏపీవో నగేష్‌, ఈసీ సందీప్‌రెడ్డి, టీఏ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా  మునగాల మండలం బరాఖత్‌గూడెం నుంచి నడిగూడెం వరకు రహదారి వెంట బహుళ వరుసల్లో నాటుతున్న మొక్కలు, వాటి రక్షణ చర్యలను పెంటయ్య పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:49:57+05:30 IST