విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-04-18T04:59:56+05:30 IST

పట్టణంలోని కల్లుబావి కాలనీ చెందిన కురువ పెద్దఈరన్న (45) అనే వ్యక్తి విద్యుదాతంతో శనివారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ఆదోని, ఏప్రిల్‌ 17: పట్టణంలోని కల్లుబావి కాలనీ చెందిన కురువ పెద్దఈరన్న (45) అనే వ్యక్తి విద్యుదాతంతో శనివారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద ఈరన్న ప్రతిరోజు సెంట్రింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే శనివారం సెంట్రింగ్‌ పనికి వెళ్లాడు. ఇంటి పైభాగాన సెంట్రింగ్‌ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు మిద్దెపై ఉన్న విద్యుత్‌ తీగలు తగిలాయి. తోటి పనివారు హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యం ప్రారంభించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెద్ద ఈరన్నకు భార్య పద్మావతితో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరసింహమూర్తి తెలిపారు. 


Updated Date - 2021-04-18T04:59:56+05:30 IST