డిప్‌ ద్వారా కార్గో టెండర్ల ఖరారు

ABN , First Publish Date - 2022-01-21T05:48:24+05:30 IST

మహబూబ్‌నగర్‌ రీజియన్‌లోని మహ బూబ్‌నగర్‌, గద్వాల్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి కార్గో సర్వీసుల నిర్వహణకు ఆర్టీసీ అధికారులు టెండర్లు కోరారు.

డిప్‌ ద్వారా కార్గో టెండర్ల ఖరారు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, జనవరి 20 : మహబూబ్‌నగర్‌ రీజియన్‌లోని మహ బూబ్‌నగర్‌, గద్వాల్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి కార్గో సర్వీసుల నిర్వహణకు ఆర్టీసీ అధికారులు టెండర్లు కోరారు. దాదాపు 69 మంది టెండర్‌ ఫారాలను దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌ నుంచి 23 మంది కాంట్రాక్ట్‌ లేబర్‌ లైసెన్స్‌ వున్న వారు దరఖాస్తు చేసుకున్నారు. వనపర్తి నుంచి 17 మంది, నాగర్‌ కర్నూల్‌ నుండా 16 మంది, గద్వాల నుండి 13 మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. డి పోల వారీగా డి.వి.యం. మాధవరావు డిప్‌ విధానంలో ఎంపిక నిర్వహించా రు. వచ్చిన టెండర్‌ ఫారాలను అధికారులు పరిశీలించిన అనంతరం యాజ మాన్యం సూచించిన విధంగా డిప్‌ విధానం ప్రకారం ఎంపిక నిర్వహించారు. లేబర్‌ లైసెన్స్‌ 4 ప్రకారం అవకాశం కల్పించాలని కొందరు కాంట్రాక్టర్లు కోరగా, లైసెన్స్‌ 6 ప్రకారం ఉన్న వారికే అధికారులు అవకాశం కల్పించారు. పై అధికారులను సంప్రదించిన తర్వాత లేబర్‌ లైసెన్స్‌ 4 ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించి మిగిలిన వారి దరఖాస్తులను పరిశీలించి డిప్‌ ద్వారా ఎంపిక నిర్వహించారు. స్థానికులకు అవకాశం కల్పించాలని కొందరు కాంట్రాక్టర్లు కోరినా అధికారులు ఒప్పుకోలేదు. ఈ కార్యక్రమంలో పీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎ.వో. నర్సయ్యతో పాటు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T05:48:24+05:30 IST