నాలుగు జిల్లాల్లో 1,076 మందికి వైరస్‌

ABN , First Publish Date - 2021-04-23T04:49:01+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టి స్తోంది.

నాలుగు జిల్లాల్లో 1,076 మందికి వైరస్‌

నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి)/ మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం)/గద్వాల టౌన్‌/నారాయణపేట క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కరోనా కల్లోలం సృష్టి స్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లో గు రువారం 1,076 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అందులో అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 518 మంది కరోనా బారిన పడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 318 మందికి వైరస్‌ సోకింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 122, నారాయణపేట జిల్లాలో 118 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-04-23T04:49:01+05:30 IST