జిల్లాలో నాలుగు వేలు దాటిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-10-30T11:45:38+05:30 IST
జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 4,007కు చేరింది. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో ..
కొత్తగా 16 మందికి పాజిటివ్
మెదక్ అర్బన్, అక్టోబరు 29: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 4,007కు చేరింది. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 16 మందికి వైరస్ సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మెదక్ టౌన్లో 4, రామాయంపేటలో 4, వెల్దుర్తిలో 3, తూప్రాన్లో 2, అల్లాదుర్గం, చేగుంట, కౌడిపల్లి మండలాల్లో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా జిల్లా అటవీ శాఖ అధికారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.