అతి తక్కువ కేసులు
ABN , First Publish Date - 2020-11-30T03:52:14+05:30 IST
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆది వారం అతి తక్కువ కేసులు నమోదయ్యాయి.
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో 21 మందికి పాజిటివ్
- వనపర్తి, నారాయణపేటలలో ఒక్కొక్కరికి వైరస్
- జోగుళాంబ గద్వాలలో నిల్
మహబూబ్నగర్ వైద్యవిభాగం/గద్వాలక్రైం/కందనూలు/వనపర్తి/నారాయ ణపేట క్రైం/అయిజ, నవంబరు 29 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆది వారం అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తం 21 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో శని, ఆది వారాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
- మహబూబ్నగర్ జిల్లాలో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
- జోగుళాంబ గద్వాలలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
- నాగర్కర్నూల్ జిల్లాలో 14 మందికి వైరస్ సోకింది.
- వనపర్తి జిల్లాలో ఒకరికి కరోనా సోకింది.
- నారాయణపేట జిల్లాలో ఒక్కటే కేసు నమోదయ్యింది.