కొత్తగా 53 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-04T03:44:47+05:30 IST
కరోనా వైరస్ నాగర్కర్నూల్ జిల్లాను వీడటం లేదు.
- అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లాలో 26 మందికి వైరస్
- నారాయణపేట జిల్లాలో నిల్
మహబూబ్నగర్ (వైద్యవిభాగం)/నారాయణపేట క్రైం/గద్వాల క్రైం/నాగర్కర్నూల్ క్రైం/వనపర్తి, డిసెంబరు 3 : కరోనా వైరస్ నాగర్కర్నూల్ జిల్లాను వీడటం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని చోట్ల వైరస్ తీవ్రగా కొంత తగ్గినా, ఈ జిల్లాలో మాత్రం తరచూ పదుల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 53 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 26 కేసులు ఈ జిల్లా నుంచే నమోదయ్యాయి. ఇక నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
- మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం 16 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలోనే ఎనిమిది మందికి వైరస్ సోకగా, వివిధ మండలాల్లో మరో ఎనిమిది మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.
- జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క గట్టు మండలంలోనే ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ కాగా, మరొక కేసు అలంపూర్ మండలంలో నమోదైంది.
- నాగర్కర్నూల్ జిల్లాలో 26 కరోనా కేసులు నమోదయ్యాయి.
- వనపర్తి జిల్లాలో నలుగురికి కరోనా సోకింది.
- నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.