భద్రాద్రి జిల్లాలో 55మందికి పాజిటివ్.. మహిళ మృతి
ABN , First Publish Date - 2020-12-04T04:57:05+05:30 IST
భద్రాద్రి జిల్లాలో 55మందికి పాజిటివ్.. మహిళ మృతి
కొత్తగూడెం కలెక్టరేట్/సుజాతనగర్, డిసెంబరు 3: కరోనా పాజిటివ్ కేసులు భద్రాద్రి జిల్లాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 మందికి పాజిటివ్ రాగా.. సుజాతనగర్లో ఓ మహిళ కరోనాతో మృతి చెందింది.
భద్రాద్రి జిల్లాలో మొత్తం 1,637 మందికి పరీక్షలు చేయగా 55మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో కొత్తగూడెం డివిజన్లో 27, భద్రాచలం డివిజన్లో 28మంది ఉన్నారు.