కరోనాతో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-03-07T05:57:44+05:30 IST
కరోనా విస్తరిస్తోంది. రెండున్నర నె లలుగా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినా, వారం రోజులుగా మళ్లీ చాప కింద నీరులా వ్యాపిస్తోంది.
మహబూబ్నగర్, మార్చి 6 : కరోనా విస్తరిస్తోంది. రెండున్నర నె లలుగా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టినా, వారం రోజులుగా మళ్లీ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా శని వారం 16 మందికి వైరస్ అంటుకోగా, ఇద్దరిని బలి తీసుకుంది.
అందులో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో ఏడుగురికి పాజిటి వ్ నిర్ధారణ అయ్యింది. అలాగే, ఈ జిల్లా కేంద్రంలోని మర్లు ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు కరోనాతో చనిపోయాడు. నాగర్కర్నూల్ జి ల్లాలో ఐదుగురు వైరస్ బారిన పడ్డారు. నాలుగు నెలల తరువాత నారా యణపేట జిల్లాలో ముగ్గురికి కరోనా సోకింది. ఇదే జిల్లాలోని జాజాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. జోగుళాంబ గద్వా ల జిల్లాలో ఒకరికి వైరస్ సోకగా, వనపర్తి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.