కరోనాతో కార్పొరేటర్ గిరి మృతి
ABN , First Publish Date - 2021-04-22T06:43:42+05:30 IST
మచిలీపట్నం నగరపాలక సంస్థ 32వ డివిజన్ కార్పొరేటర్ చింతా గిరి (37) కరోనా సోకి మృతి చెందారు.
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 21 :మచిలీపట్నం నగరపాలక సంస్థ 32వ డివిజన్ కార్పొరేటర్ చింతా గిరి (37) కరోనా సోకి మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు. గిరి మృతికి మంత్రి పేర్ని నాని, మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, టీడీపీ నాయకులు మెరుగు కాళేశ్వరరావు తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.