Delhi: భారత్‌లో కొనసాగుతున్న Covid ఉధృతి

ABN , First Publish Date - 2022-07-15T16:47:48+05:30 IST

న్యూఢిల్లీ (Delhi): భారత్‌లో కోవిడ్ (Covid) ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ యక్టీవ్ కేసులు...

Delhi: భారత్‌లో కొనసాగుతున్న Covid ఉధృతి

న్యూఢిల్లీ (Delhi): భారత్‌లో కోవిడ్ (Covid) ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకీ యక్టీవ్ కేసులు (Active cases) పెరుగుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,038 కొత్త కేసులు నమోదు కాగా.. 47 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 1,39,073 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతానికి చేరింది. దేశంలో యాక్టీవ్ కేసులు 0.32 శాతంగా ఉంది. అలాగే దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 4,37,10,027 కరోనా కేసులు నమోదు కాగా.. 5,25,604 మంది మృత్యువాతపడ్డారు. కరోనా రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. నిన్న కరోనా చికిత్స నుంచి కోలుకుని 16,994 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి 4,30,45,350 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2022-07-15T16:47:48+05:30 IST