460 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-10-24T10:19:00+05:30 IST
జిల్లాలో శుక్రవారం 460 మందికి కరోనా సోకింది. మరో ముగ్గురు బాధితులు మరణించారు. కొత్త కేసులతో కలిపి..
ముగ్గురు మృతి
205 మంది డిశ్చార్జి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో శుక్రవారం 460 మందికి కరోనా సోకింది. మరో ముగ్గురు బాధితులు మరణించారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 36,446కు చేరాయి. మరణాలు అధికారికంగా 542కు పెరిగాయి. 24 గంటల్లో 205 మంది వైరస్ నుంచి కోలుకుని ఇంటికి చేరుకోగా, ఇంకా 3,348 మంది బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.