కరోనా కట్టడికి సహకరించాలి

ABN , First Publish Date - 2021-04-24T05:26:38+05:30 IST

కరోనా కట్టడికి సహకరించాలి

కరోనా కట్టడికి సహకరించాలి
రైతుబజార్‌లో వినియోగదారులు భౌతికదూరం పాటించేలా మార్కింగ్‌ చేయిస్తున్న ఎస్టేట్‌ ఆఫీసర్‌

ఉయ్యూరు, ఏప్రిల్‌ 23 : కరోని మహమ్మారి విజృంభిస్తున్న నేపఽథ్యంలో రైతుబజార్‌కు వచ్చే  వినియోగదారులు మాస్క్‌ తప్పనిసరిగా ధరించి దుకాణాల వద్ద భౌతికదూరం పాటించాలని ఉయ్యూరు రైతుబజార్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు అన్నారు. కొవిడ్‌ నిబంధన ల్లో భాగంగా  రైతుబజార్‌ ఆవరణలో  దుకాణాల వద్ద భౌతికదూరం పాటిం చేలా సర్కిల్‌ మార్కింగ్‌  చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా రోజురోజుకు  కల్లోలం సృష్టిస్తున్న పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దుకాణా ల్లో రైతులు మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకున్నామని, వినియోగదారులు కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించి మాస్క్‌లు ధరించి గుంపులుగా ఉండకుండా   భౌతిక దూరం పాటించి మార్కింగ్‌ చేసిన చోట నిలిచి సహక రించాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లోకి రావద్దని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-04-24T05:26:38+05:30 IST