గుంటూరు: కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి

ABN , First Publish Date - 2021-04-12T16:38:14+05:30 IST

గుంటూరు: నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి చెందారు.

గుంటూరు: కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి

గుంటూరు: నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి చెందారు. జలగం రామారావు మున్సిపల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో పది మంది విద్యార్థులు, టీచర్లకు పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో 9వ తరగతి వరకు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే కాసు శాయమ్మ మున్సిపల్ స్కూల్ టీచర్ కరోనాతో మృతి చెందారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-04-12T16:38:14+05:30 IST