నకిలీ ఏసీబీ అధికారిపై కేసు
ABN , First Publish Date - 2020-07-06T10:22:14+05:30 IST
పాతపట్నంలో కలకలం రేపిన నకిలీ ఏసీబీ అధి కారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ టి. రాజేష్ తెలిపారు.
పాతపట్నం, జూలై 5: పాతపట్నంలో కలకలం రేపిన నకిలీ ఏసీబీ అధి కారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ టి. రాజేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఫిబ్రవరి 27, 28వ తేదీల్లో స్థానిక సామాజిక ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు దాడులు చేసి పాతపట్నంలోని ఇద్దరు ల్యాబ్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏసీబీ అధికా రులు ల్యాబ్ నిర్వాహకులను శ్రీకాకుళం పిలిపించి విచారించారు. కాగా ఇందులో ఒక ల్యాబ్ నిర్వాహకుడికి ఫోన్చేసి తాను ఏసీబీ అధికారినంటూ ఓ వ్యక్తి కేసు బలహీన పరిచేందుకు పెద్ద మొత్తంలో డిమాండ్ చేశాడు. దీంతో ల్యాబ్ నిర్వాహకుడు బమ్మిడి అప్పలనాయుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధి తుడి ఫిర్యాదు మేరకు నిందితుడు జి.మురళీకృష్ణను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. నిందితుడు పాశిగంగు పేట గ్రామానికి చెందినవాడని ఆయన పేర్కొన్నారు.