డి-మార్ట్‌పై కేసు

ABN , First Publish Date - 2020-07-06T09:57:20+05:30 IST

కొవిడ్‌ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించకుండా విక్రయాలు కొనసాగిస్తున్న కుషాయిగూడ డి-మార్ట్‌ స్టోర్‌పై పోలీసులు కేసు

డి-మార్ట్‌పై కేసు

ఏఎ్‌సరావునగర్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించకుండా విక్రయాలు కొనసాగిస్తున్న కుషాయిగూడ డి-మార్ట్‌ స్టోర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కుషాయిగూడ డి-మార్ట్‌ స్టోర్‌ యాజమాన్యం భౌతిక దూరం పాటించకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం తనిఖీలు చేశారు. స్టోర్‌లో గుంపులు గుంపులుగా కొనుగోలుదారులు ఉండటాన్ని గమనించారు. మేనేజర్‌ సునీల్‌కుమార్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ జి. భరత్‌చంద్రపై కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-07-06T09:57:20+05:30 IST