చీరాల వన్టౌన్ సీఐపై కేసు
ABN , First Publish Date - 2020-11-30T01:42:01+05:30 IST
చీరాల వన్టౌన్ సీఐ రాజమోహన్పై కేసు నమోదైంది.
చీరాల, నవంబరు 29 : చీరాల వన్టౌన్ సీఐ రాజమోహన్పై కేసు నమోదైంది. డీఎస్పీ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 5న గడియార స్తంభం సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి విద్యుత్ దీపాల అలంకరణ విషయంలో యాతం క్రాంతి పోలీసులపై దౌర్జన్యంగా వ్యవహరించాడు. ఆ క్రమంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తరువాత విడుదల చేశారు. ఆ తరువాత అతను చీరాల ఏరియా వైద్యశాలలో చేరి సీఐ రాజమోహన్ తనను కొట్టారని అవుట్పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి వన్టౌన్ పోలీసులు కోర్టు డైరెక్షన్ కోసం పంపించారు. ఆ క్రమంలో నాలుగు రోజుల క్రితం కోర్టు సూచనల మేరకు వన్టౌన్ ఎస్సై నాగశ్రీను కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.