అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

ABN , First Publish Date - 2022-07-01T06:32:35+05:30 IST

కైకలూరు మండలం పందిరిపల్లెగూడెంలో జయ మంగళ రామరాజు ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

కైకలూరు, జూన్‌ 30: కైకలూరు మండలం పందిరిపల్లెగూడెంలో జయ మంగళ రామరాజు ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లేరు గ్రామపెద్దల తీర్పుతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో కైకలూరు రూరల్‌ ఎస్సై సంఘటనా స్థలానికి వెళ్ళి విచా రణ చేపట్టారు. మృతదేహాన్ని కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టు మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. అనుమా నాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సీహెచ్‌.కృష్ణ తెలిపారు.

Updated Date - 2022-07-01T06:32:35+05:30 IST