ఏసీబీ అధికారినంటూ బెదిరించడంపై కేసు
ABN , First Publish Date - 2021-05-07T04:12:05+05:30 IST
ఏసీబీ అధికారిని అంటూ ఓ వ్యక్తి నుడా అధికా రులను బెదిరించిన సంఘటనపై దర్గామిట్ట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
నెల్లూరు(క్రైం) : మే 6: ఏసీబీ అధికారిని అంటూ ఓ వ్యక్తి నుడా అధికా రులను బెదిరించిన సంఘటనపై దర్గామిట్ట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు ఈ నెల 3న నుడా వైస్చైర్మెన్ కె రమేష్, జూనియర్ ప్లానింగ్ అధికారి మురళిలకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఏసీబీ డీఎస్పీ రవికుమార్నని పరిచయం చేసుకు న్నాడు. అనంతరం ఇందుకూరుపేటలో షఫీ, హమీద్ భవన నిర్మాణానికి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని, లేకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని బెదిరించాడు. దీంతో నుడా అధికారులు జరిగిన విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్ చేసింది డీఎస్పీ కాదని తెలవడంతో నుడా వైస్చైర్మన్ దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ తెలిపారు.