వైద్యుడిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-01-23T05:02:08+05:30 IST

పెళ్లిపేరుతో యువతిని మోసగించిన ఘటనలో వేదాయపాలెం పోలీసులు ఓ వైద్యుడిపై కేసు నమోదు చేశారు.

వైద్యుడిపై కేసు నమోదు

నెల్లూరు (క్రైం), జనవరి 22: పెళ్లిపేరుతో యువతిని మోసగించిన ఘటనలో వేదాయపాలెం పోలీసులు ఓ వైద్యుడిపై కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు కర్నూలుకు చెందిన చంద్రశేఖర్‌ నగరంలోని సండేమార్కెట్‌ సమీపంలో ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. బీవీ నగర్‌కు చెందిన ఓ యువతి అదే వైద్యశాలలో రిసెప్షెనిస్టుగా పని చేస్తోది. ఈ క్రమంలో డాక్టర్‌ ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. కొంతకాలంగా ఆమెను దూరంగా ఉంచడంతో ఆమె పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ప్రాధేయపడింది. అతను అంగీకరించకపోవడంతో ఆమె డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని శనివారం వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  సీఐ నరసింహరావు వైద్యుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-01-23T05:02:08+05:30 IST