35 మంది సమాజ్‌వాదీ పార్టీ నేతలపై కేసు

ABN , First Publish Date - 2021-05-11T19:28:32+05:30 IST

కోవిడ్ నిబంధలతో పాటు 144 సెక్షన్ ఉల్లంఘించిన 35 మంది సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) నేతలపై..

35 మంది సమాజ్‌వాదీ పార్టీ నేతలపై కేసు

ఉన్నావో: కోవిడ్ నిబంధలతో పాటు 144 సెక్షన్ ఉల్లంఘించిన 35 మంది సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) నేతలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా అజ్‌గైన్ జిల్లాలోని ఓ బాంక్విట్ హాలులో ఈనెల 8న ఈ నేతలంతా సమావేశమయ్యారని అడిషనల్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి శేఖర్ సింగ్ మంగళవారంనాడు తెలిపారు. బ్యాంక్వింట్ హాలు యజమానితో పాటు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ సాజన్, మాజీ ఎమ్మెల్యే ఉదయ్‌రాజ్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర యాదవ్, స్థానిక ఎస్‌పీ నేతలు అరుణ్ శంకర్ శుక్లా, అశోక్ చండేల్, అనురుథ్ చండేల్, సేవక్‌లాల్ రావత్‌ తదితరులపై అజ్‌గైన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్టు చెప్పారు.

Updated Date - 2021-05-11T19:28:32+05:30 IST