అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-05-11T05:00:44+05:30 IST

కడప నగరం కోఆపరేటివ్‌ కాలనీలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తుండడంతో ఆసుపత్రి నిర్వాహకుడు మహ్మద్‌ ఆలీపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు.

అధిక ఫీజులు వసూలు చేసిన  ప్రైవేటు ఆసుపత్రిపై కేసు నమోదు

కడప(క్రైం), మే 10: కడప నగరం కోఆపరేటివ్‌ కాలనీలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తుండడంతో ఆసుపత్రి నిర్వాహకుడు మహ్మద్‌ ఆలీపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు. సీఐ వివరాల మేరకు కోఆపరేటివ్‌ కాలనీలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో స్పెషల్‌ టీం దాడులు నిర్వహించగా కోవిడ్‌ బాధితుల వద్ద అధిక డబ్బులు వసూలు చేసినట్లు తేలిందన్నారు. దీంతో ఆ సుపత్రి నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున ్నట్లు తెలిపారు.

Updated Date - 2021-05-11T05:00:44+05:30 IST