Case registered: పూజారులతో బీజేపీ ఎంపీ అనుచిత ప్రవర్తన
ABN , First Publish Date - 2021-08-02T18:09:22+05:30 IST
పూజారులతో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ ఎంపీతోపాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు...
డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): పూజారులతో అనుచితంగా ప్రవర్తించిన బీజేపీ ఎంపీతోపాటు అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలోని జాగేశ్వర్ ఆలయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ ధర్మేంద్ర కశ్యప్, అతని స్నేహితులు పూజారులతో అనుచితంగా ప్రవర్తించి, దుర్భాషలాడారు. దీంతో బీజేపీ ఎంపీ ధర్మేంద్ర కశ్యప్, అతని స్నేహితులపై కేసు నమోదైంది.ఆలయం లోపల ఎంపీ ప్రవర్తనకు వ్యతిరేకంగా స్థానికులు,ప్రతిపక్ష పార్టీల వివిధ పార్టీల రాజకీయ నాయకులు కూడా తమ నిరసన తెలిపారు.ఈ ఘటనపై అల్మోరా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ మోనిక, తహసీల్దారు సంజయ్ కుమార్ లు సంఘటన గురించి పూజారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సీనియర్ డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం సబ్ ఇన్ స్పెక్టరు గోపాల్ సింగ్ బిష్ట్ ఎంపీ కశ్యప్, అతని స్నేహితులపై ఐపీసీ సెక్షన్ 188, 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.