పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-03-06T06:46:20+05:30 IST

నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌పై పట్టణ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎన్నికల ని బంధనలకు విరుద్ధంగా మసీదులోకి వెళ్లారని సెక్షన 188కింద కేసు నమోదు చేశారు.

పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

అక్రమ కేసు బనాయించారు..: శ్రీరామ్‌

        ధర్మవరం, మార్చి 5: నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ పరిటాలశ్రీరామ్‌పై పట్టణ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎన్నికల ని బంధనలకు విరుద్ధంగా మసీదులోకి వెళ్లారని సెక్షన 188కింద కేసు నమోదు చేశారు. అయితే ముస్లింల అనుమతి తీసుకుని కేవలం ప్రార్థనలు చేయడానికి వెళ్లామని, అయితే పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి పరిటాల శ్రీరామ్‌పై అక్రమ కేసు నమోదు చేశారని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మసీదులోకానీ, బయట కానీ ఎటువంటి ప్రచారం చే యలేదని, కావాలనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని పరిటాల శ్రీరామ్‌ పేర్కొన్నారు. అధికార పార్టీ అభ్యర్థులు వందల మందితో ప్రచా రం నిర్వహిస్తున్న పోలీసులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని, అయితే తాము మాత్రం నిబందనల ప్రకా రం నడుచుకుంటున్న ఏదోవంక చూపుతూ ఇబ్బందులకు గురిచేయాలని అ డుగడుగునా ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.


Updated Date - 2021-03-06T06:46:20+05:30 IST