చెట్లను నరికేసిన వ్యక్తిపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-07-27T04:11:54+05:30 IST
కోహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని శంకర్నగర్ సమీపంలో రాజీవ్ రహదారిపై హరితహారంలో పెరిగిన చెట్లను నరికేసిన వ్యక్తిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
కోహెడ, జూలై 26 : కోహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని శంకర్నగర్ సమీపంలో రాజీవ్ రహదారిపై హరితహారంలో పెరిగిన చెట్లను నరికేసిన వ్యక్తిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పంచాయతీ కార్యదర్శి శోభ వివరాల ప్రకారం రాజీవ్ రహదారిపై ఉన్న మయూరి దాబా హోటల్కు అడ్డుగా చెట్లు ఉన్నాయని, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా మహ్మద్ బాద్షా మొయినుద్దీన్ ఏడు చెట్లను నరికేశాడు. ఈ విషయాన్ని కలెక్టర్ వాట్సా్పకు సమాచారం అందించి పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేశానని కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.