భూ ఆక్రమణపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-10-25T11:22:43+05:30 IST

చెరువు తట్టు పోరంబోకు భూములను ఆక్రమించిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మోహన్‌ తెలిపారు.

భూ ఆక్రమణపై కేసు నమోదు

పోరుమామిళ్ల, అక్టోబరు 24: చెరువు తట్టు పోరంబోకు భూములను ఆక్రమించిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మోహన్‌ తెలిపారు. కవలకుంట్ల పంచాయతీ పరిధి బుచ్చంపల్లె చెరువుకు సంబంధించి 42 సర్వేనెంబరులో 50 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందన్నారు. ఇందులో ఆక్రమణకు పాల్పడిన ఆరుగురిపై తహసీల్దరు అయూబ్‌ఖాన్‌ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-10-25T11:22:43+05:30 IST