ఓటీఎస్‌ కింద నగదు వసూలు భారమవుతోంది..

ABN , First Publish Date - 2021-12-02T06:03:04+05:30 IST

వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద లబ్ధిదారుల నుండి నగదు వసూలు చేయడం బరువైపోతోందని కొంత మంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటీఎస్‌ కింద నగదు వసూలు భారమవుతోంది..

- సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల ఆవేదన 

ఓబుళదేవరచెరువు, డిసెంబరు 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద లబ్ధిదారుల నుండి నగదు వసూలు చేయడం బరువైపోతోందని కొంత మంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తహసీల్దార్‌ స్వర్ణలత, హౌసింగ్‌ ఏఈ షామీర్‌బాషా, ఎంపీపీ తుమ్మల పర్వీన్‌ షామీర్‌, ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు పూల రెడ్డెప్ప హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచులు మాట్లాడుతూ అధికారులు అయితే తమకు టార్గెట్‌లు కేటాయించారని, ఆమేరకు గ్రామాలకు వెళ్ళి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అయినప్పటికీ లబ్ధిదారుల నుండి తగిన స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-02T06:03:04+05:30 IST