ఆదర్శ మాతృమూర్తులకు నగదు పురస్కారాలు

ABN , First Publish Date - 2021-05-10T05:38:49+05:30 IST

తీవ్ర వైకల్యం కలిగిన బిడ్డలకు సేవలందిస్తున్న ఆదర్శ మాతృమూర్తులకు కేకేవీబీఎస్‌ సంస్థ పురస్కారాలతో సత్కరించింది.

ఆదర్శ మాతృమూర్తులకు నగదు పురస్కారాలు

 కేకేవీబీఎస్‌ సంస్థ ఆధ్వర్యంలో అందజేత


రామచంద్రాపురం, పటాన్‌చెరు, మే 9: తీవ్ర వైకల్యం కలిగిన బిడ్డలకు సేవలందిస్తున్న ఆదర్శ మాతృమూర్తులకు కేకేవీబీఎస్‌ సంస్థ పురస్కారాలతో సత్కరించింది. మాతృమూర్తుల దినోత్సవ సందర్భంగా టీఎండీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపతి రవికుమార్‌, సీనీ నటుడు టార్జన్‌, టేక్మాల్‌ తహసీల్దార్‌ గ్రేసీబాయి, ఇస్నాపూర్‌ సర్పంచ్‌ బాలమణి శ్రీశైలం, ఉపసర్పంచ్‌ శోభాకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు శ్రీదేవి, శైలజ, సత్యం ఆదివారం ఆన్‌లైన్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. 17 మంది ఆదర్శ మాతృమూర్తులను ఎంపిక చేసి గూగుల్‌ పే ద్వారా నగదును బదిలీ చేశారు. వక్తలు తల్లుల సేవలను కొనియాడారు. 

Updated Date - 2021-05-10T05:38:49+05:30 IST