ప్రతిభా విద్యార్థులకు నగదు బహుమతులు

ABN , First Publish Date - 2022-08-18T05:16:07+05:30 IST

గత సంవత్సరం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరచిన విద్యా ర్థులకు 1991-92లో పదో తరగతి చది విన పూర్వ విద్యా ర్థులు నగదు బహుమతులు అందించారు.

ప్రతిభా విద్యార్థులకు నగదు బహుమతులు
విద్యార్థినికి నగదు బహుమతి అందిస్తున్న దృశ్యం





 నల్లమాడ, ఆగస్టు 17: గత సంవత్సరం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ప్రతిభ కనబరచిన విద్యా ర్థులకు 1991-92లో పదో తరగతి చది విన పూర్వ విద్యా ర్థులు నగదు బహుమతులు అందించారు. ఈకార ్యక్రమం ఎస్‌ఐ వలీబాషాఆధ్వర్యంలో బుధవారం రొద్దం నారాయణరెడ్డి మెమోరియల్‌ మెరిట్‌ స్కాలర్‌ షిపు పేరు మీద ఆర్‌ఎన గోపాల్‌రెడ్డి, ఆర్‌ఎన ప్రశాంతి దేశా యి ఆర్థికసాయం చేశారు. సనాఫర్‌హిల్‌ (576) సాధించినందుకు రూ.10వేలు,  సోమ్ముగుట్ట యంగారెడ్డి మెమోరియిల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్పు పేరున అతడి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి గ్రీష్మ(569)కు రూ.6వేలు, పఠాన జబ్బార్‌ ఖాన మెమోరియల్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్పును  అర్చన (567)కు సల్మానఖాన రూ.5 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హరిప్రసాద్‌, ఎనవీ రామాంజనేయులు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T05:16:07+05:30 IST