యాపిల్ ఉత్పత్తులు... క్యాష్బ్యాక్ ఆఫర్లు...
ABN , First Publish Date - 2021-01-17T20:08:25+05:30 IST
తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారికి భారీగా రాయితీలను అందించనున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. యాపిల్ స్టోర్ నుంచి ఆన్లైన్ ద్వారా రూ. 44,900 విలువకు పైబడిన కొనుగోళ్ళు జరిపినపక్షంలో... రూ. 5 వేల వరకు క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
న్యూఢిల్లీ : తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారికి భారీగా రాయితీలను అందించనున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. యాపిల్ స్టోర్ నుంచి ఆన్లైన్ ద్వారా రూ. 44,900 విలువకు పైబడిన కొనుగోళ్ళు జరిపినపక్షంలో... రూ. 5 వేల వరకు క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
కాగా... ఈ నెల 21 నుంచి 28 వరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ఎంపిక చేసుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. దీంతోపాటు ఆరు నెలల ‘నో కాస్ట్ ఈఎంఐ’ సదుపాయాన్ని కూడా కల్పించింది. బుక్ చేసుకున్న వస్తువులు డెలివరీ అయిన తర్వాత మాత్రమే క్యాష్బ్యాక్ అందుతుందని ఒక ప్రకటనలో వెల్లడించింది.