జీడి పరిశ్రమలు తెరిపించేందుకు హామీ

ABN , First Publish Date - 2020-08-09T10:38:48+05:30 IST

జీడి పరిశ్రమలను సోమవారం నుంచి తెరిపించి ఉపాధి కల్పిస్తామని మంత్రి అప్పలరాజు హామీ ఇచ్చినట్టు జీడి కార్మిక సంఘ నాయకులు..

జీడి పరిశ్రమలు తెరిపించేందుకు హామీ

పలాస, ఆగస్టు 8: జీడి పరిశ్రమలను సోమవారం నుంచి తెరిపించి ఉపాధి కల్పిస్తామని మంత్రి అప్పలరాజు హామీ ఇచ్చినట్టు  జీడి కార్మిక సంఘ నాయకులు అంబటి కృష్ణమూర్తి, బొంపల్లి సింహాచలం తది తరులు అన్నారు. ఈ మేరకు శనివారం వారు మంత్రి అప్పలరాజును కలి సి జీడి కార్మికులు పడుతున్న కష్టాలను వివరించినట్టు చెప్పారు. వంద రోజులుగా లాక్‌డౌన్‌ వల్ల పనులు లేక ఇబ్బంది పడుతున్నామని, పరిశ్ర మలు తెరవకపోతే వలస వెళ్లిపోయే పరిస్థితి వస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సోమవారం నుంచి పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి ఇవ్వాలని వ్యాపారు లను ఆదేశిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు పను లు చేసుకోవాలని కార్మికులకు సూచించినట్టు చెప్పారు. 

Updated Date - 2020-08-09T10:38:48+05:30 IST