యజమాని సమాధి పక్కనే కూర్చుంటున్న పిల్లి.. కన్నీరు పెట్టుకుంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-01-17T12:37:40+05:30 IST

సోషల్ మీడియాలో పెంపుడు జంతువులు..

యజమాని సమాధి పక్కనే కూర్చుంటున్న పిల్లి.. కన్నీరు పెట్టుకుంటున్న నెటిజన్లు!

సోషల్ మీడియాలో పెంపుడు జంతువులు- వాటి యజమానులకు సంబంధించిన కథనాలు సంచలనం రేకెత్తిస్తుంటాయి. ఇప్పుడు తాజాగా ఇటువంటి ఉదంతమొకటి వైరల్‌గా మారింది. ఈ కథనాన్ని చదివిన పలువురు నెటిజన్లు కంటతడి పెట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే రెండు నెలల క్రితం ఒక పెంపుడు పిల్లి యజమాని కన్నుమూశాడు. అప్పటి నుంచి ఆ పిల్లి తన యజమాని సమాధి పక్కనే కూర్చుంటోంది. 2021, నవంబరు 6 న షేక్ మువామెర్ జుక్రోల్ గుండెపోటుతో మృతి చెందారు. అతని పెంపుడు పిల్లి  ఇప్పుడు తన యజమాని సమాధి వద్దనే అనునిత్యం ఉంటోంది.


షేక్ మువామెర్ జుక్రోల్ ముస్లిం సముదాయానికి చెందిన ప్రముఖ వ్యక్తి. ఆయన బతికున్న రోజుల్లో ఒక పిల్లిని అమితమై ప్రేమతో చూసుకున్నారు. హటాత్తుగా ఆయన గుండెపోటుతో మరణించారు. అప్పటి నుంచి ఆపిల్లి యజమాని సమాధిని విడిచి పెట్టడం లేదు. తీవ్రమైన మంచుకురుస్తున్నప్పటికీ ఆ పిల్లి అక్కడి నుంచి కదలడం లేదు. ప్రతీరోజూ యజమాని సమాధి చుట్టూనే అది తిరుగుతోంది. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆ పిల్లిపై అమితమైన జాలి కురిపిస్తూ, కన్నీరు పెట్టుకుంటున్నారు.

Updated Date - 2022-01-17T12:37:40+05:30 IST