విద్యుదాఘాతానికి రెండు గేదెల మృతి

ABN , First Publish Date - 2021-01-22T05:08:28+05:30 IST

పట్టణంలోని బీఎంఆర్‌నగర్‌ సమీపంలో గురువారం విద్యుదాఘాతానికి గురై రెండు గేదెలు మృతి చెందాయి.

విద్యుదాఘాతానికి రెండు గేదెల మృతి
విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిన గేదెలు

విద్యుదాఘాతానికి రెండు గేదెల మృతి 

నాయుడుపేట టౌన్‌, జనవరి 21 : పట్టణంలోని బీఎంఆర్‌నగర్‌ సమీపంలో గురువారం విద్యుదాఘాతానికి గురై రెండు గేదెలు మృతి చెందాయి. స్థానిక అగ్రహారపేటలో నివాసం ఉంటున్న కటకం పెంచలయ్యకు చెందిన రెండు  గేదెలు మేతకు వెళ్తుండగా తెగిపడిన విద్యుత్‌ తీగలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆ గేదెలే తనకు జీవనాధారమని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఫిర్యాదు చేశాడు.  రెండు గేదెలు దాదాపు లక్ష రూపాయల విలువ చేస్తాయని పేర్కొన్నాడు.


Updated Date - 2021-01-22T05:08:28+05:30 IST