మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టిపై సీబీఐ కేసు

ABN , First Publish Date - 2021-04-22T10:07:40+05:30 IST

గుంటూరు పశ్చిమం మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. తాడిశెట్టి వెంకటరావు ఎస్‌బీఐ నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో గుంటూరు సీఐడీలో కూడా కేసు నమోదైంది.

మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టిపై సీబీఐ కేసు

గుంటూరు, ఏప్రిల్‌ 21: గుంటూరు పశ్చిమం మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. తాడిశెట్టి వెంకటరావు ఎస్‌బీఐ నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో గుంటూరు సీఐడీలో కూడా కేసు నమోదైంది. ఎస్‌బీఐ నుంచి పొగాకు వ్యాపారం పేరుతో తాడిశెట్టి రూ.72 కోట్లు రుణం తీసుకున్నారు. రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. తీసుకున్న రుణాన్ని బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు. దీంతో ఎస్‌బీఐ అధికారులు సీబీఐని ఆశ్రయించారు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టితోపాటు మరో ఎనిమిది మందిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-04-22T10:07:40+05:30 IST