కోడి కత్తి దాడిపై కూడా సి.బి.ఐ. విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2020-03-12T06:13:53+05:30 IST

వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య రాష్ట్ర ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కేసు దర్యాప్తు కూడా అనుమానాస్పదంగా కొనసాగిన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల కోరిక మేరకు సి.బి.ఐ. దర్యాప్తునకు ఆదేశించటం హర్షణీయం.

కోడి కత్తి దాడిపై కూడా సి.బి.ఐ. విచారణ జరిపించాలి

వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య రాష్ట్ర ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కేసు దర్యాప్తు కూడా అనుమానాస్పదంగా కొనసాగిన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యుల కోరిక మేరకు సి.బి.ఐ. దర్యాప్తునకు ఆదేశించటం హర్షణీయం. పాలకుల వైఖరి కేసును తప్పుదారి పట్టించేవిధంగా  ఉండడమే, న్యాయస్థానం కేసు దర్యాప్తును సి.బి.ఐ.కి అప్పగించటానికి బలమైన కారణంగా భావించవచ్చు. ఇదే సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన కోడి కత్తి కేసు విషయంలోనూ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దాడికి గురి అయిన జగన్ మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై నమ్మకంలేదు అని చెప్పిన విషయం మరువలేం. ఆ కేసుపై కూడా సి.బి.ఐ. దర్యాప్తును కోరితే ప్రజల్లో అనుమానాలు తొలగిపోతాయి. 


– ఆర్కే, గన్నవరం

Updated Date - 2020-03-12T06:13:53+05:30 IST