వివేకా హత్య కేసును సీబీఐ చూస్తోంది: డీజీపీ

ABN , First Publish Date - 2022-02-28T23:28:27+05:30 IST

వివేకా హత్య కేసును సీబీఐ చూస్తోందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణలో ఏపీ

వివేకా హత్య కేసును సీబీఐ చూస్తోంది: డీజీపీ

విశాఖ: వివేకా హత్య కేసును సీబీఐ చూస్తోందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణలో ఏపీ పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారు. గంజాయి సాగు, అక్రమ రవాణా కట్టడికి ఒడిశాతో జాయింట్‌ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగంపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. కాలేజీలు, రిసార్ట్స్‌, కాటేజ్‌లపై ప్రత్యేక దృష్టి సారించామని, విలేజ్ పోలీస్ యాక్ట్ సజీవంగానే ఉందని చెప్పారు. సచివాలయ పోలీస్ వ్యవస్థ, కోర్టు తీర్పు ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-02-28T23:28:27+05:30 IST