హుజురాబాద్ ఉపఎన్నికపై సీఈసీ సమీక్ష

ABN , First Publish Date - 2021-10-29T02:48:53+05:30 IST

హుజురాబాద్ ఉపఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఎన్నికల

హుజురాబాద్ ఉపఎన్నికపై సీఈసీ సమీక్ష

హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. సీఈఓ, నోడల్ అధికారులు, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులతో సమీక్ష జరిపింది. ఉప ఎన్నిక ఏర్పాట్లు, శాంతి భద్రతల విషయంపై ఆరా తీసింది. డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులపై వివరాలను సీఈసీ అడిగింది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఈసీ ఆదేశించింది. 


Updated Date - 2021-10-29T02:48:53+05:30 IST