సింరేణిలో సంబరాలు
ABN , First Publish Date - 2021-07-27T06:24:11+05:30 IST
సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయో పరిమితి 61సంవత్సరాలకు పెంచుతూ సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకోవడం పట్ల గోదావరిఖని చౌరస్తాలో టీబీజీకేఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
- పదవీ విరమణ పెంపుపై కార్మికుల హర్షం
గోదావరిఖని, జూలై 26: సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయో పరిమితి 61సంవత్సరాలకు పెంచుతూ సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకోవడం పట్ల గోదావరిఖని చౌరస్తాలో టీబీజీకేఎస్ ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీబీజీకేఎస్ ప్రఽధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కార్మికుల వయోపరిమితి 61సంవత్సరాలకు పెంచుతూ కారుణ్య నియామకాల క్రింద లింగబేదం లేకుండా అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షనీయమని, ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ శ్రీధర్కు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు మిర్యాల రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ, నూనె కొమురయ్య, దేవ వెంకటేశం, యాదవరెడ్డి, వెంకటేష్, కృష్ణమూర్తి, పుట్ట రమేష్, గంగాధర్, చెల్పూరి సతీష్, శ్రావణ్, అల్లం ఐలయ్య, దొరగండ్ల మల్లయ్య, పెంచాల తిరుపతి, బేబి శ్రీనివాసస్, నాయిని శంకర్, రాజిరెడ్డి పాల్గొన్నారు.