సీతారామచంద్రస్వామికి అభిషేకం

ABN , First Publish Date - 2021-04-18T05:16:37+05:30 IST

శ్రీరామనవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేముల వాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో శనివారం ఉదయం సీతారామచంద్రస్వామివారికి ఉపనిషత్‌ ద్వారాభిషేకం నిర్వహించారు.

సీతారామచంద్రస్వామికి అభిషేకం
హంస వాహనంపై విహరిస్తున్న స్వామివారలు

వేములవాడ, ఏప్రిల్‌ 17: శ్రీరామనవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేముల వాడ  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో శనివారం ఉదయం  సీతారామచంద్రస్వామివారికి ఉపనిషత్‌ ద్వారాభిషేకం నిర్వహించారు. శ్రీరామనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆలయ అర్చకులు, వేదపండితులు ఉదయం  రాజరాజేశ్వరస్వామివారికి  మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,  సీతారామచంద్రస్వామివారికి ఉపనిషత్‌ ద్వారా అభిషేకం, సాయంత్రం ప్రత్యేక పూజలు  చేశారు. పరివార, అనుబంధ దేవతలకు అభిషేకములు నిర్వహించారు. రాత్రి  లక్ష్మీఅనంత పద్మనాభస్వామి,  పార్వతీ రాజరాజేశ్వరస్వామివారల ఉత్సవ విగ్రహాలను హంస వాహనంపై ఆలయ ఆవరణలో ఊరేగించారు. ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:16:37+05:30 IST