వాయులింగేశ్వరుడి సేవలో ప్రముఖులు

ABN , First Publish Date - 2021-07-25T05:18:45+05:30 IST

వాయులింగేశ్వరుడి దర్శనార్థం కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనరు చంద్రభూషణ్‌ తదితరులు శ్రీకాళహస్తికి విచ్చేశారు.

వాయులింగేశ్వరుడి సేవలో ప్రముఖులు
ముక్కంటి ఆలయంలో చంద్రభూషణ్‌

శ్రీకాళహస్తి, జూలై 24: వాయులింగేశ్వరుడి దర్శనార్థం శనివారం కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనరు చంద్రభూషణ్‌, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి రాజీవ్‌సాహి ఎండ్లా, ఐఏఎస్‌ అధికారి విక్రాంత్‌పాండే శనివారం శ్రీకాళహస్తికి విచ్చేశారు. వేర్వేరు సమయాల్లో వచ్చిన ప్రముఖులకు ఆలయ అఽధికారులు స్వాగతం పలికి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు. గురుదక్షిణామూర్తి సన్నిధి చేరుకున్న వీరిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్‌ నాగభూషణ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T05:18:45+05:30 IST