సెల్టవర్ నిర్మాణం వద్దని వినతి
ABN , First Publish Date - 2021-03-07T02:24:44+05:30 IST
స్థానిక జొన్నాయగుంట ప్రాంతంలో సెల్టవర్ వద్దని ఆ ప్రాంత మహిళలు శనివారం డీఎస్పీ డీ.
కావలి, మార్చి6: స్థానిక జొన్నాయగుంట ప్రాంతంలో సెల్టవర్ వద్దని ఆ ప్రాంత మహిళలు శనివారం డీఎస్పీ డీ. ప్రసాద్రావుకు విన్నవించారు.. అక్కడ సెల్టవర్ నిర్మాణం జరుగుతుండటంతో స్థానికులు శుక్రవారం నిర్మాణాన్ని అడ్డుకున్నారు. సెల్టవర్ నిర్మించే వ్యక్తి ఈ విషయం డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎస్పీ అక్కడ సెల్ టవర్ నిర్మాణాన్ని అడుకోవద్దని చెప్పటంతో ఆ ప్రాంత వాసులంతా డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని తమ ప్రాంతంలో సెల్టవర్ నిర్మాణం చేపడితే దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. వెంటనే సెల్టవర్ నిర్మాణా న్ని ఆపించాలని కోరారు. స్పందించిన డీఎస్పీ మాట్లాడుతూ టవర్ నిర్మాణం చేపట్టేవారు కూడా కోర్ట్టు నుంచి అనుమతులు తెచ్చుకున్నందున, వాటిని ఎవరైనా అడ్డుకుంటే వారిపై కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పారు.