Cellphone ఇవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-04-07T14:08:03+05:30 IST
స్థానిక విల్లివాక్కంలో తల్లి సెల్ఫోన్ ఇవ్వలేదని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విల్లివాకం్క సిడ్కో నగర్కు చెందిన మంజుల కుమార్తె రోహిణి (16) అదే ప్రాంతంలోని ప్రభుత్వ
పెరంబూర్(చెన్నై): స్థానిక విల్లివాక్కంలో తల్లి సెల్ఫోన్ ఇవ్వలేదని టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. విల్లివాకం్క సిడ్కో నగర్కు చెందిన మంజుల కుమార్తె రోహిణి (16) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతోంది. ఆన్లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులు రోహిణికి సెల్ఫోన్ కొనిచ్చారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైనా రోహిణి తరచూ సెల్ఫోన్లో గేమ్లు ఆడుతుండేది. దీంతో, కుమార్తెను మందలించిన తల్లి ఆమె సెల్ఫోన్ తీసుకొంది. సెల్ఫోన్ ఇవ్వాలని అడిగినా ఫలితం లేకపోవడంతో రోహిణి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై విల్లివాక్కం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.